హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన గుజరాత్ ఎంఐఎం నేత డానిష్ ఖురేషిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారణాశి జ్ఞానవాపి మసీదులో శివలింగాన్ని గురించి ప్రస్తావిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఖురేషి ట్వీట్ చేశాడు.
శివలింగం గురించిఅసభ్యకరమైన భాషను వాడాడు ఖురేషి. హిందుమతంలోని శివలింగ భావనను అవమానించడమే తన లక్ష్యం అన్నట్టుగా ఆ ట్వీట్ ఉంది. ట్వీట్లోని కంటెంట్ పూర్తిగా ఓ కమ్యూనిటీ విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో నరోడా, వస్నా పోలీస్ స్టేషన్లలో ఆయనపై రెండు ఫిర్యాదులు అందాయి. కేసునమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.