భైంసా అల్లర్లపై స్పందించిన ఎంఐఎం చీఫ్.
నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘర్షణలపై మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాష్ట్రంలో అన్ని చోట్ల శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని.. అయితే ప్రతిసారి భైంసాలోనే ఎందుకు ఇలా లా అండ్ ఆర్డర్ అదుపుతప్పి ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని ప్రశ్నించారు. అంతేకాదు.. నిజామాబాద్తో పాటుగా ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. మంగళవారం నాడు సిటీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. బీజేపీ వాళ్లు చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. వారంతా చిన్నపిల్లలంటూ ఎద్దేవా చేస్తూ.. వాళ్లు ఏదైనా మాట్లాడుతారన్నారు. భైంసా అల్లర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నానని.. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అయితే కొందరు కుట్రపూరితంగా తమపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారన్నారు. అయితే ముస్లిం సమాజంలో ఉండే పేదలందరినీ తాము కాపాడుకుంటామని ఓవైసీ తెలిపారు.
https://twitter.com/ANI/status/1369222048032067588