ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీల వివరాలు చూస్తుంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఎంపీలుగా పార్లమెంటులో అడుగుపెడుతున్న వారి ఆస్తులు చాలా ఎక్కువ అని లెక్క తేలుతోంది. కొత్త ఎంపీల్లో చాలామంది కోటీశ్వరులు ఉండటం గమనించాల్సిన విషయం.
2024 సంవత్సరం దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలు వివరాలు వెలుగుచూస్తున్నాయి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు సమర్పించిన అఫిడవిట్ ల ఆధారంగా ఎంపీల ఆస్తుల్ని లెక్క చూడడం జరిగింది. దేశవ్యాప్తంగా కోటీశ్వరులే ఎక్కువమంది ఎంపీలు అయినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలుగా ఎన్నికైన వారిలో అత్యధిక శాతం మంది కోట్లకు పడగలు ఎత్తిన వారే. ఈ దేశంలోని అత్యంత సంపన్న ఎంపీగా గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ నిలుస్తున్నారు. ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా ఎక్కువమంది సంపన్నులు పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీల్లో ఎక్కువ శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. ప్రస్తుత ఎంపీలు సగటు పట్టణ నివాసితుల కన్నా.. 27 రెట్లు సంపన్నవంతులని లెక్కలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మొత్తం ఎంపీల ఆస్తుల విలువ 7.4 కోట్లు. దాదాపు 92 శాతం మంది ఎంపీలు కోటి రూపాయలు లేదా అంతకుమించి ఆస్తులున్నాయి.
75 శాతం మంది ఎంపీలకు మూడు కోట్ల రూపాయలు లేదా అంతకుమించి ఆస్తులున్నాయి. 2024లో రన్నరప్ అభ్యర్థుల మధ్యస్థ ఆస్తి విలువ 6.25 కోట్లు. 88 శాతం మంది ఎంపీలకు కోటి రూపాయలు లేదా అంతకుమించి ఆస్తులు ఉన్నాయి. 68 శాతం మందికి మూడు కోట్లు లేదా అంతకుమించి ఆస్తులున్నాయి.
2019 ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఎక్కువ ఆస్తులు కలిగిన ఎంపీలే ఎక్కువ మంది ఉన్నారు. 2019లో గెలిచిన ఎంపీల సగటు ఆస్థి 4.8 కోట్లుగా ఉంది. ఇటీవల గెలిచిన ఎంపీల సగటు ఆస్థి 6.5 కోట్లుగా ఉంది. గత ఎన్నికల్లో కోటి రూపాయలకు మించి ఆస్తులు కలిగిన ఎంపీలు 95 శాతంగా ఉన్నారు. మూడు కోట్లకు మించిన అభ్యర్థులు 88 శాతంగా ఉన్నారు.
2019లో రన్నరప్ అభ్యర్థులు ఆస్తుల విలువ 5.4 కోట్లు. దాదాపు 85 శాతం మంది కోటి రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. ఇక 63 శాతం మంది మూడు లేదా అంతకుమించి ఆస్తుల్ని కలిగి ఉన్నారు. 2024లో టాప్ 27 పార్టీల అభ్యర్థుల సగటు ఆస్తులు కనీసం కోటి రూపాయలుగా ఉంది. 7.6 కోట్లు, 5.4 కోట్లు ఆస్తులు కలిగిన పార్టీలుగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నిలిచాయి. ఆల్ ఇండియా డెబిట్ అండ్ ఇన్వెస్టిమెంట్ సర్వే – 2019 అంచనా ప్రకారం సగటు పట్టణ కుటుంబాల్లోని ఆస్తుల సగటు విలువ 27.1 లక్షలు. గ్రామీణ కుటుంబాల ఆస్తుల విలువ 15.9 లక్షలుగా ఉంది.
ఈ లెక్కలతో పోల్చితే 2024లో గెలిచిన అభ్యర్థి సగటు ఆస్తుల విలువ పట్టణ కుటుంబ సగటు ఆస్తి కంటే 27 రెట్లు ఎక్కువ. ఇక రన్నరప్ అభ్యర్థి ఆస్తులు 23.1 రెట్లు ఎక్కువ. అయితే మొత్తం గెలిచిన ఎంపీల్లో ఎంతమంది కొన్ని లక్షల రూపాయల ఆస్తుల్ని కలిగి ఉన్నారు?వారిలో పశ్చిమబెంగాల్లోని పురూలియా నుంచి గెలిచిన బిజెపి నేత జ్యోతిర్మరు సింగ్ మహతో ఉన్నారు. ఈయనకి 5.95 లక్షలు ఆస్తులు ఉన్నాయి.
లక్షల్లో ఆస్తులు ఉన్నవాళ్లు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. కానీ మొత్తం గా చూసుకుంటే మాత్రం పార్లమెంట్లో అత్యధిక శాతం మంది అపర కోటీశ్వరులు అనేది అక్షర సత్యం.