గ్యాలియర్ సమీపంలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో భారత వాయుసేన సీనియర్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం గ్యాలియర్ సమీపంలో కంబాట్ ట్రైనింగ్ మిషన్ నిర్వహిస్తుండగా.. గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న గ్రూప్ కెప్టెన్ ఎ.గుప్తా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే గ్వాలియర్ స్క్వాడన్ కమాండింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నామని భారత వాయుసేన తెలిపింది. అయితే గతేడాది కూడా మిగ్-21 విమానాలు కుప్పకూలుయి. రష్యా తయారు చేసిన ఈ మిగ్-21 యుద్ధ విమానాలకు ఎగిరే శవ పేటికలుగా కూడా పేరుంది. ఈ మిగ్-21 యుద్ధ విమానాలతో గతంలో పాక్కు చెందిన ఎఫ్-18 యుద్ధ విమానాన్ని మన సైన్యం కుప్పకూల్చిన సంగతి తెలిసిందే.