శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కోసం ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల ప్రీ బ్రిడ్ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. నేటి నుంచి ఈనెల 13 వరకు బిడ్ లు స్వీకరించనున్నారు. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు పూర్తిగా ప్రభుత్వ నిధులతో మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. 31 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి 6250 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నరు. ఈనెల 9న రాయదుర్గ్ లో మెట్రో నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు.