తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సమయాలు కుదించారు. నేటినుంచి పదిరోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతోంది. అయితే ఉదయం 6నుంచి 10 గంటల వరకు మాత్రం సడలింపునిచ్చారు. ఇక హైదారాబాద్ లో ఉదయం 7 గంటలనుంచి 8.45 వరకు మాత్రమే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్, నాగోలు, జేబీఎస్, మియాపూర్, రాయదుర్గం నుంచి ఉదయం 8.45కి చివరి రైలు ఉంటుందన్నారు. ఇవన్నీ 9.45 వరకు చివరి స్టేషన్ కు చేరుకుంటాయి.