కేరళ బీజేపీ సీఎం అభ్యర్ధిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్.
'Metro Man' E Sreedharan (in file photo) will be BJP's Chief Minister candidate in the upcoming #KeralaAssemblyElections2021: State BJP chief K Surendran pic.twitter.com/EgQVQ5RSQi
— ANI (@ANI) March 4, 2021
కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పక్కా ప్లాన్లు వేస్తూ దూసుకెళ్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖులను బీజేపీలోకి ఆహ్వానించిన పార్టీ.. ఇప్పుడు ప్రముఖ నేతను సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది. గత కొద్ది రోజులుగా సీఎం అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న మెట్రో మ్యాన్ శ్రీధరన్ను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కే.సురేంద్రన్ గురువారం నాడు అధికారికంగా ప్రకటించారు.
కాగా, టెక్నోక్రాట్, మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఇటీవలే కమలం గూటికి చేరుకున్నారు. అయితే ఆయన బీజేపీలోకి చేరకముందే పార్టీ తరఫున అతను సీఎం అభ్యర్ధిగా ఉండేందుకు సుముఖత చూపినట్లు తెలిసింది. శ్రీధరన్కు ఉన్న క్లీన్ ఇమేజ్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ శ్రీధరన్ను సీఎం అభ్యర్ధిగా ఎంచుకుంది.