రోడ్ ప్రమాదాల నివారణ కు నవ నిర్మాణ్ సొసైటీ చొరవ చూపింది. సోనాల మండల కేంద్రం నుంచి టివిటి,జీడిపల్లె మీదుగా బోథ్ వెళ్లే దారిలో పలు చోట్ల మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి.వీటి వద్ద రహదారికి ఇరువైపులా చెట్లకొమ్మలు,గుబురు పొదలు పెరగటంతో ఎదురుగా వచ్చే వాహనాలు ముందుకు వచ్చే వరకు కనిపించటం లేదు.దీంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. దీనిని గమనించిన నవ నిర్మాణ్ సొసైటీ సభ్యులు చెట్ల కొమ్మలు,గుబురు పొదలను కొట్టివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త/ఉపాధ్యాయులు రడాపు మధుసూధన్,సొసైటీ అధ్యక్షులు కోస్మెట్ శుద్ధోధన్,మునిగెల శ్రీధర్,నాగరాజు,జంగు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నవ నిర్మాణ్ సభ్యులను స్థానికులు అభినందించారు.