ఆర్థిక సంక్షోభంతో అన్నివిధాలా కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. ముఖ్యంగా అక్కడ ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. మందుల కొరత వల్ల,… పేరదేనియా ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు సైతం నిలిపేసిన పరిస్థితి. దీంతో తన వంతు సాయంగా భారత్ USD 1 బిలియన్ రుణం సాయం చేసింది. అందులో భాగంగా ఇంధనాన్ని కూడా పంపింది.
ఇక అక్కడి ఆస్పత్రుల్లో మందుల్లోక ఆపరేషన్లు కొనసాగడం లేదన్న వార్త భారత విదేశాంగమంత్రిని చేరింది. దీంతో ఆన ఆస్పత్రికి అవసరమైన మందులు పంపుతామంటూ శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి కాల్ చేశారు. ఈమేరకు భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లోతోనూ మాట్లాడినట్టు జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇటీవలే జైశంకర్ శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధాని మహీందా రాజపాక్స, అధ్యక్షుడు గోటబయ రాజపాక్స సహా మంత్రివర్గంలోని ఇతర మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు జైశంకర్ మార్చి 27న శ్రీలంక చేరుకున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి శ్రీలంకకు ఎలా సహాయపడుతుందనే దానిపై భారతదేశ దృక్కోణాలను ఆయన చర్చించారు.
మంగళవారం కొలంబోలో జరిగిన 18వ BIMSTEC (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) మంత్రివర్గ సమావేశంలో డాక్టర్ జైశంకర్ పాల్గొన్నారు. సహకార రంగాలను, ముఖ్యంగా కనెక్టివిటీ, శక్తి, సముద్ర సహకార రంగాలను తీవ్రతరం చేయడానికి.. విస్తరించడానికి భారత్ నిబద్ధతతో ఉందని స్పష్టం చేస్తూ… దక్షిణాసియా దేశాల ముఖ్యులను కలిశానంటూ ట్వీట్ చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)