బిజేపి మీడియాని కూడా రాజకీయం చేస్తున్నది ! ఔనా ?
బిజేపి తనకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలని మీడియా మీదకి ఉసిగొల్పుతున్నది ! అవునా ?
నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎవరు ఎవరికోసం స్థాపించారు ? మారిచిపోయారా ?
ఎన్డిటివి వ్యవస్థాపకులు ఎవరు ? ప్రణయ్ జేమ్స్ రాయ్ భార్య రాధిక రాయ్.. కమ్మీలు.
రాధికా రాయ్ అక్క బృంద కారత్ .. రాజ్య సభ సభ్యురాలు CPI[M].
బృంద కారత్ భర్త CPI[M] జెనెరల్ సెక్రటరీ ..2005 – 2015 వరకు.
సిపిఐ[M] అనే పార్టీ బిజేపి కి బద్ధ వ్యతిరేకి. బిజేపి సంగతి పక్కన పెడితే అసలు మన దేశానికే బద్ధ వ్యతిరేకి !
2015 కి ముందు వరకు గుర్తుకు రాని మీడియా – రాజకీయ సంబంధాలు ఇప్పుడు హఠాత్తుగా గుర్తుకి వచ్చి ప్రజాస్వామ్యం – పత్రిక స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయిందా ?
తన జర్నలిస్టులకి శాటిలైట్ ఫోన్ లు ఇవ్వగల డబ్బు ఉన్న మీడియా సంస్థ ఎన్డిటివి సోషలిజం గురుంచి ఉపన్యాసాలు ఇస్తే అది గొప్ప కదూ ? సమ సమాజ స్థాపన కోసం గొంతెత్తి అరిచే కమ్మీలు తోటి మీడియా జర్నలిస్టులకి కూడా శాటిలైట్ ఫోన్ లు ఇచ్చి ప్రోత్సహించాలి కదా ? అలా చేయలేదు ఎందుకో ?
తమకి సాగిన కాలంలో తోటి మీడియా మిత్రులతో ఎన్డిటివి జర్నోలు తోటి జర్నోలతో తాము ఆకాశం నుండి దిగివచ్చిన వాళ్ళలా ప్రవర్తించిన తీరు బాధితులు చెపితేనె అందం చందం! విలేఖరుల సమావేశానికి ఆలస్యంగా వచ్చి సెంటర్ పాయింట్ లో ఉన్న ఇతర మీడియా జర్నోలని తాము ఎన్డిటివి అంటూ పక్కకి నెట్టేసిన ఘటనలు కోకొల్లలు ! వీళ్ళ దాష్టీకాన్ని సహించని చిన్న విలేఖరులు ఎదురు తిరిగితే ఉద్యోగాలు ఊడపీకించిన ఘనత ఎన్డిటివి దే !
నువ్వు నడిచిన దారి నీకు విజయాన్ని ఎలా ఇచ్చిందో అదే దారిలో నీ వెనక వచ్చిన వాళ్ళకి కూడా విజయాన్ని ఇచ్చింది ఇప్పుడు. నువ్వు నడిచిన దారి తప్పుడుది అయితే నువ్వు కూడా తప్పుడు వాడివే ! ఒక పేరుమోసిన దొంగ ఇంకొక దొంగని దొంగ అని ఎలా అనగలడు?
అందరికంటే ఇప్పుడు ఎక్కువ ఏడ్చేది THE HINDU పత్రిక యజమాని రామ్ మాత్రమే ! ఎందుకంటే రెండు అబద్ధాలని రెండు వేరే వేరే వర్షన్ లలో చెప్పి జనాలని మోసం చేసేవాళ్ళు ఇప్పుడు తోడు దొంగ దొరికిపోయాడు.
ఇంతకీ రాధిక రాయ్ కాని ఆవిడ అక్క బృంద కారత్[క్రిస్టియన్] లు మొహాన పెట్టుకునే ఇంతేసి బొట్టు ని చూసి నిజమయిన హిందువులు వీళ్లేనేమో అనే భయం కలుగుతుంది మనకి. వీళ్ళు నిఖార్సయిన కమ్మీ లు అని సామాన్య ప్రజలకి ఎప్పటికీ తెలియదు. ప్రణయ్ జేమ్స్ రాయ్ [క్రిస్టియన్ ].
– పోట్లూరి పార్ధసారధి