ఏప్రిల్ 13న హరిద్వార్లోని శ్రీ పూర్ణానంద్ ఆశ్రమంలో జరిగిన ఆరు రోజుల వేదనాథ సమ్మేళనం ముగింపు సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని భారతీయ మీడియా తప్పుగా పేర్కొందనడానికి ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ కనిపిస్తుంది.
సాధువులు , దార్శనికుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ “సమాజం ఒక లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు సాగుతోంది. ప్రజలు దానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. మేము ఎల్లప్పుడూ మీతోనే ఉంటాము. లక్ష్యాలను సాధించడానికి సమయం పడుతుంది. మేము దాని గురించి సుదీర్ఘ చర్చలు చేసినప్పటికీ కార్యరూపం మనం అనుకున్నంత సులభం కాదు. నా దగ్గర ఏమీ లేదు. అంతా ప్రజల చేతిలోనే ఉంది. వారు సిద్ధమైతే అందరి భవితవ్యం మారిపోతుంది. ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నాం, మీరు కూడా అలాగే చేయండి. అదే వేగంతో ఐక్యంగా ఆదర్శంగా ముందుకు సాగుదాం. ఓటమి లేకుండా, భయం లేకుండా ఐక్యంగా విజయపథంలో పయనిద్దాం. అనుకున్న విధంగా పని పూర్తి చేద్దాం. ఇది పూర్తి కావడానికి 20-25 ఏళ్లు పడుతుందని మీరు చెబుతున్నారు. వేగం పెంచితే 10-15 ఏళ్లు పడుతుందని నేను చెబుతున్నాను. స్వామి వివేకానంద భవ్య భారతాన్ని తన మనో నేత్రాలతో, మనం ఆకాంక్షిస్తున్న భారతాన్ని దృశ్యమానం చేశారు. ప్రస్తుత జీవితకాలంలో ఈ శరీరంతో, కళ్లతో మహిమాన్వితమైన భారతాన్ని మనం చూడబోతున్నామని శ్రీ అరబిందో ప్రవచించారు. అదే మా ఇద్దరి ఆశయం. అది మనందరి సంకల్పం” అని అన్నారు.
సర్ సంఘచాలక్ తన ప్రసంగంలో స్వామి వివేకానంద, శ్రీ అరబిందో దృశ్యమానం చేసిన గ్లోరియస్ భారత్ను గురించి చెప్పారు, మహిమాన్వితమైన భారతదేశ పూర్వ సాక్షాత్కారం గురించి మాట్లాడారు.
కానీ కొందరు మీడియా ప్రతినిధులు ‘అఖండ భారత’ని ఆయన [ప్రసంగంలో నుంచి లేనిదీ ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ‘15 ఏళ్లలో మోహన్ భగవత్ అఖండ భారత్’ అనే శీర్షికతో కథనాలను ప్రచురించారు. “అతను ఏ సామర్థ్యంతో దాని గురించి మాట్లాడుతున్నాడు” వంటి ప్రశ్నలతో వారు ప్రచారం కూడా ప్రారంభించారు. ఆయన ప్రధానినా? ఆయన హోం మంత్రినా? అతను న్యాయమూర్తా? ”
ఆర్ఎస్ఎస్ విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరు ఇదే.