నరేంద్ర మోడీపై ప్రతిపక్షాల ద్వేషానికి మీడియా లో కూడా కొందరు విసిగిపోయారు.
టీవీ9 గ్రూప్ బిజెపి వ్యతిరేకం అని అందరికి తెలుసు. దాని యుపి, ఉత్తరాఖండ్ ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ అమితాబ్ అగ్నిహోత్రి కాశీ విశ్వనాధ్ దేవాలయం మీద ఖర్చు గురించి సెక్యూలర్ రాజకీయ నాయకులు గొడవ చేయడం మీద కడిగి పారేశాడు.
రైతులు, బీద వారి గురించి మీరు మాట్లాడటమా?
నేను పత్రికా విలేఖరుగా కొన్ని రాజకీయ నాయకుల పెళ్లిళ్ళు చూసాను. వందల కోట్లు ఖర్చుపెట్టి, 5 కోట్లు ఖరీదు చేసే కార్లలో ప్రయాణించి, 2 లక్షల ఖరీదు చేసే పెంపుడు చిలుకలను సొంతం చేసుకుంటున్న వాళ్ళు కాశీ విశ్వనాథ పునరుద్ధరణకు ఖర్చు చేయడంపై ఫిర్యాదు చేయడంపై వారి హిపోక్రసీ బయట పడుతోంది. కొన్ని పెళ్లిళ్లలో, కాన్పూర్లోని చమన్గంజ్ వద్ద తిరిగే విక్రమ్ టెంపోల మాదిరిగా ప్రైవేట్ విమానాలు గాల్లో లేస్తూ ఉంటాయి. ఎవడో పాన్ కావాలంటే వాళ్ళని విమానంలో పాన్ వాలా వద్దకు తీసుకెళ్లారు.
సిక్కులు స్వర్ణ దేవాలయం పై చేసే ఖర్చును ఎన్నడూ ప్రశ్నించలేదు. వాటికన్ సిటీలో పోప్ నియంతృత్వాన్ని ఎవరూ ప్రశ్నించరు. మక్కా మరియు మదీనాలో జరుగుతున్న దాని గురించి ఎటువంటి ప్రశ్నలు తలెత్తవు. కాశీ విశ్వనాథ్ని ప్రశ్నించడానికి మీకు ఎంత ధైర్యం?
దేశానికి పరమ శక్తి (సర్వశక్తిమంతుడు) కావాలి, దానికి ఆరాధ్య (ఆరాధన), ప్రతీక్ (దేవుని చిహ్నాలు) కావాలి. కృష్ణుడి పుట్టినరోజు 5,000 సంవత్సరాలుగా జరుపుకుంటున్నట్లయితే, అతను దేవుడని మీరు నమ్మకపోయినా, అతను ఎంత శక్తివంతమైన వ్యక్త్తోఅని ఆలోచించండి.
అమితాబ్ అగ్నిహోత్రి యొక్క ముగింపు వ్యాఖ్య:
“ఇవి సాధారణ శక్తులు అని మీరు అనుకుంటున్నారా? ఇవి భారతదేశం యొక్క ప్రాణ శక్తి. ప్రాణ వాయువు. వాటిని తుడిచివేయలేరు. అనేక శక్తులు నాశనం చేయలేకపోయారు. మొఘలులు చేయలేకపోయారు. మీరు చేయగలరని మీరు అనుకుంటున్నారా? ఆ సంగతి మరచిపోండి