ద్రౌపది ముర్ముకు మద్దతు పలికారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రపతి
“పార్టీ ఉద్యమంలో ఆదివాసీ సమాజం ముఖ్యమైన భాగమని దృష్టిలో ఉంచుకుని.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకి మద్దతు ఇవ్వాలని BSP నిర్ణయించింది. ఈ నిర్ణయం బీజేపీ లేదా ఎన్డీయేకు మద్దతు ఇవ్వడమో లేదా ప్రతిపక్ష యూపీఏకు వ్యతిరేకంగా వెళ్ళడానికో కాదు. మా పార్టీ దాని ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని సమర్థత, అంకితభావం కలిగిన ఆదివాసీ మహిళను దేశానికి అధ్యక్షురాలిగా చేయడానికి తీసుకున్న నిర్ణయం” అని మాయావతి అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆమెను ఆహ్వానించలేదని బిఎస్పి అధినేత్రి తెలిపారు.
“మమతా బెనర్జీ జూన్ 15 న రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష అభ్యర్థిని ఎన్నుకోవడానికి పిలిచిన సమావేశంలో కొన్ని పార్టీలను మాత్రమే ఆహ్వానించారు, అలాగే జూన్ 21న శరద్ పవార్ సమావేశం ఏర్పాటు చేసినపుడు.. అప్పుడు కూడా బీఎస్పీని ఆహ్వానించలేదు. ఇది వారి కులతత్వ ఉద్దేశాలను చూపిస్తుంది” అని ఆమె అన్నారు.