ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసంలో చాలీసాచదువుతానని ప్రకటించి జైలుకెళ్లిన రాణా దంపతులపై మండిపడ్డారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే.
మసీదులో లౌడ్ స్పీకర్లలో అజాన్ వినబడితే, హనుమాన్ చాలీసా ప్లే చేయమని తానంటే… రాణా దంపతులు మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్లారని..మాతోశ్రీ ఏమైనా మసీదా? అని ప్రశ్నించారు. గతంలో బహిరంగ సభల్లో ప్రకటించిన అయోధ్య పర్యటనను రద్దు చేసుకుని రాజ్ ఠాక్రే పూణేలో సభ నిర్వహించారు రాజ్ ఠాక్రే.
మహారాష్ట్రలో లౌడ్స్పీకర్ల ద్వారా అజాన్ను ప్లే చేయడం ఆపకపోతే.. మసీదుల వెలుపల లౌడ్స్పీకర్లను ఏర్పాటు చేసి, హనుమాన్ చాలీసాను రెట్టింపు స్థాయిలో ప్లే చేస్తానని గతంలో ఠాక్రే చెప్పారు. ఆయన ప్రకటనల నేపథ్యంలో అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణా రంగంలోకి దిగారు. సీఎం నివాసం ‘మాతోశ్రీ’ బయట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ప్రకటించారు.
అయితే, వారికి వ్యతిరేకంగా శివసేన సభ్యుల నిరసనలు వారి ప్రణాళికలను రద్దు చేయడానికి కారణమయ్యాయి. అనంతరం వారిపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిపై ఉన్న కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.