అసోం ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు హిమంత బిశ్వశర్మ. చట్ట విరుద్ధంగా వస్తున్న సెటిలర్లు 2050 నాటికి అసోంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బ్లూప్రింట్ చేశారని అన్నారు. పలు నియోజకవర్గాల్లో వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇంటెలిజెన్స్ సహా పలు సంస్థల నివేదికల ఆధారంగా తానీవిషయం చెబుతున్నానన్నారు.
ఇటీవల డరంగ్ జిల్లాలోని సిపఝర్ రెవిన్యూ సర్కిల్లో, గోరుఖుటి గ్రామంలో కొందరిని ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నాలను ప్రస్తావించారు. ఇక్కడ సెటిల్ అయినవారిలో అత్యధికులు ఈ ప్రాంతానికి చెందినవారు కాదన్నారు. డల్గావ్, బాగ్బోర్ వంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారన్నారు. సిపఝర్నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడమే వీరి లక్ష్యమన్నారు. వీరు దశలవారీగా భూములను ఆక్రమించుకుంటారని, హోజాయ్ జిల్లాలోని లండింగ్, సోనిట్పూర్లోని బర్చల్లా కూడా వీరి జాబితాలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే వీరు నాగావున్ జిల్లాలోని బటడ్రోబా నియోజకవర్గాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.
గొరుఖుటి గ్రామంలో నివసిస్తున్న 10,000 మందిలో 6,000 మంది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)లో తమ పేర్లు నమోదు చేయించుకోలేదన్నారు. ఇక్కడి సహజసిద్ధ స్థానికులకు అన్ని రకాల పత్రాలు ఉన్నాయని, వీరి పేర్లు ఎన్ఆర్సీలో కూడా ఉన్నాయని అన్నారు.