హర్యానాలో ఘోరం జరింగింది. రోహ్తక్లోని భాలి ఆనంద్పూర్ లో పెళ్లి బరాత్ లోనే యువతిని తుపాకీతో కాల్చాడు మహ్మద్ సాహిల్ అనే యువకుడు. ప్రస్తుతం ఆ యువతి చావుబతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటన జరిగిన నాలుగురోజులకు హర్యానా-యూపీ సరిహద్దులో పోలీసులు సాహిల్ ను అదుపులోకి తీసుకున్నారు.
కొంతకాలంగా యువతి తనిష్కను వేధిస్తున్న సాహిల్..ఆమె పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని వరుడితో అత్తింటికి వెళ్తుండగా ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. చిన్నప్పటినుంచి తనుష్క చదువు, ఆటపాటల్లో చురుగ్గా ఉండేదని గ్రామస్తులు అంటున్నారు. గతంలో పలుమార్లు సాహిల్ ఆమె వెంటబడి వేధిస్తుంటే గ్రామపెద్దలే హెచ్చరించి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధం కుదిర్చి పెళ్లిచేశారు. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన సాహిల్ పెళ్లిఊరేగింపు జరుగుతుండగా వచ్చి తుపాకీతో ఆమెపైకి కాల్పులు జరిపాడు.
కేసు విచారణకు రోహ్తక్ ఎస్పీ ఉదయ్ సింగ్ మీనా ఆధ్వర్యంలో…. డీఎస్పీ మహేశ్ కుమార్ సహా ఆరుగురు సభ్యులతో కూడిన సిట్ను నియమించింది ప్రభుత్వం. ఈ మధ్య ఇలాంటి దారుణాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ముస్లిం యువకులు కావాలని హిందూ అమ్మాయిలను వేధిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. 2020 అక్టోబర్ లో అదే ప్రాంతంలో నికితా తోమర్ అనే 21 ఏళ్ల యువతిని తౌసీఫ్ అనే యువకుడు కాల్చి చంపాడు. ఇస్లాంలోకి వచ్చి తనను పెళ్లిచేసుకోవాలని బలవంతపెట్టగా అందుకు ఆమె నిరాకరించడమే అందుకు కారణం.