తమిళనాడు బీజేపీ చీఫ్ గా పగ్గాలు తీసుకుంది మొదలు దూసుకెళ్తున్నారు అన్నామలై. ఆయన పర్యటనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అన్నామలై వస్తున్నారంటేనే జనం ఎగబడుతున్న పరిస్థితి. దీంతో పార్టీ ఎక్కడికక్కడ ఫంక్షన్ హాళ్లను బుక్ చేస్తూ వస్తోంది. అయితే ఆయన దూకుడుకు కళ్లెం వేసే పనిలో పడ్డారు ప్రత్యర్థులు. ఎప్పుడు, ఎలా దొరికిపోతారా అని వేచిచూస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్మీడియాలో ఓ పోస్టులో ఆయన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడి ఫిర్యాదులు చేశారు. మే 30న ఆయన చేసిన ఒక ట్వీట్లో ‘పరియా’ అనే మాట వాడారు. దీనిపై పలు పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ… ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై చాలాచోట్ల కేసులు నమోదయ్యాయి.
https://twitter.com/annamalai_k/status/1531197314542448641?s=20&t=BwAoix7L3KLauJrYI0M0Gw