తీవ్ర ఒడిదుడుకుల్లో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలు నమోదు చేసుకున్నాయి.
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిర్ణయాన్ని వెలువరించడం నిన్న మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింది. ఇవాళ ఉదయం నుంచి అదే ఉత్సాహం కనిపించింది. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో దూసుకెళ్లింది. అయితే ఆ జోరు కాసేపే కనిపించింది. మధ్యాహ్నం తరువాత మదుపర్లు లాభాల స్వీకరణ కు మొగ్గు చూపారు. దీంతో కాస్త ఒడుదొడుకులు కనిపించాయి. ఒకదశలో నష్టాల్లో ట్రేడయిన సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కోవిడ్-19 తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లుకు ధైర్యాన్నిచ్చింది.