మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి. జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్ గోయల్ వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలైనట్లు తెలిపారు. వివరాలు …
ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఉండే ఓ గ్రామాల్లోకి మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఈ ఉదయం చుట్టుపక్కల గ్రామాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు గడ్చిరోలి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మావోయిస్ట్ (సీపీఐ-మావోయిస్ట్) కార్యకర్తలు హతమయ్యారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మావోయిస్టు నేత మిలింద్ తెల్తుంబ్డే కూడా ఈ కాల్పుల్లో మరణించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఎల్గార్ పరిషత్-భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పుణే పోలీసులు.. తెల్తుంబ్డేను వాంటెడ్ నిందితుల జాబితాలో చేర్చారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పోలీసుల బృందం అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డట్టు వివరించారు గిరిజా శంకర్. ఈ కాల్పుల్లో కమాండర్ సాకేత్ మృతిచెందగా.. అతడి దగ్గరి నుంచి ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నామన్నారు.
కాల్పులపై rediff.com నివేదిక
కాల్పుల తర్వాత మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కోర్చి తహసీల్ (రెవెన్యూ యూనిట్)లోని గ్యారపట్టి ప్రాంతంలోని మర్డింటోలా అటవీప్రాంతంలో పోలీసులు భారీ ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 13, rediff.com నివేదిస్తుంది. ఎన్కౌంటర్ స్థలం నుంచి 20 మంది పురుషులు, ఆరుగురు మహిళలు సహా 26 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిలో ఐదు AK-47 రైఫిళ్లు, ఒక అవ్టోమాట్ కలాష్నికోవా మోడర్నిజిరోవన్నీ (AKM) అసాల్ట్ రైఫిల్, ఒకటి అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్ (UBGL), తొమ్మిది సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్ (SLRలు), మూడు .303 2.2 రైఫిల్స్, తొమ్మిది ఉన్నాయి. సింగిల్ బోర్, ఒక INSAS (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) అసాల్ట్ రైఫిల్, ఒక పిస్టల్ మరియు పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన మావోయిస్టులలో మావోయిస్టు అగ్రనేత మిలింద్ బాబూరావు తెల్తుంబ్డే అకా దీపక్ తెల్తుంబ్డే అకా సహ్యాద్రి అకా జీవ, ‘సెంట్రల్ కమిటీ’ సభ్యుడు మరియు సిపిఐ-మావోయిస్ట్ ‘మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ’ ‘సెక్రటరీ’ ల పై ఐదు మిలియన్ల రివార్డుఉన్నది . అతని తల, లోకేశ్ అకా మంగు మడ్కం, ‘డివిజనల్ కమిటీ మెంబర్’ (DCM), అతని తలపై INR రెండు మిలియన్ల రివార్డుఉన్నది మహేష్ గోటా, ‘DCM’, INR 1.6 మిలియన్ల రివార్డ్తో; ‘కమాండర్లు’ కిషన్ జైమాన్ మరియు సన్ను కొవాచి, ఒక్కొక్కరు INR 800,000 రివార్డ్ని కలిగి ఉన్నారు. ఎన్కౌంటర్లో మరణించిన మహిళా మావోయిస్టులలో విమ్లా అకా మన్సో బోగా, ఆమె తలపై INR 400,000 రివార్డ్ఉన్నది మిలింద్ తెల్తుంబ్డే యొక్క అంగరక్షకురాలు. నవంబర్ 13 తెల్లవారుజామున సి-60 బృందం ‘కంపెనీ నెం. 4’, తిపగడ్ లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్ (LOS), కోర్చి LOS, విస్తార్ ‘ప్లాటూన్’, ‘సెంట్రల్ కమిటీ’ సభ్యుడు మిలింద్ తెల్తుంబ్డే యొక్క గార్డ్ మరియు ఇతర దళాలు (సాయుధ స్క్వాడ్లు) మర్డింటోలా అడవిలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. కమాండోలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు, ఇందులో 26 మంది మావోయిస్టులు మరణించారు మరియు నలుగురు SF సిబ్బంది గాయపడ్డారు దీనికంటేపూర్వం ఏప్రిల్ 3, 2021న, ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మావోయిస్ట్ (CPI-మావోయిస్ట్) కార్యకర్తలు కనీసం 22 మంది భద్రతా దళం (SF) సిబ్బందిని హతమార్చారు.
దశాబ్దాలుగా సాగుతున్న మావోయిస్ట్ ఉద్యమ పరిస్తితి . ఇట్లా దేశం లో దశాబ్దాలుగా సాగుతున్న మావోయిస్ట్ ఉద్యమ పరిస్తితి గమనిద్దాము.
దేశంలో కమ్యూనిస్టు పార్టీ చరిత్ర 100 సంవత్సరాలు దాటింది, 1920వ సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. ఈ వందేళ్ల చరిత్రలో వ్యూహాత్మక తప్పిదాలు చేయటంలో తన రికార్డులను తానే బ్రద్దలు కొట్టుకున్నచరిత్ర దానిది , స్వాతంత్రం కోసం దేశ ప్రజలంతా క్విట్ ఇండియా ఉద్యమం చేస్తుంటే కమ్యూనిస్టుల ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించి ప్రజలకు దూరమయ్యారు, అట్లాగే సైద్ధాంతిక సంఘర్షణలతో ముక్కలు చెక్కలైంది , ఇప్పుడు దేశంలో ఎన్నో కమ్యూనిస్టు గ్రూపులు పని చేస్తున్నప్పటికీ మూడు మాత్రమే ప్రధానమైనవి, ప్రజాస్వామ్య వ్యవస్థ లో పనిచేస్తూ ఎన్నికల్లో పాల్గొంటున్న 1)సిపిఐ, 2) సిపిఎం పార్టీ లు, 3) సాయుధ పోరాట మార్గం అనుసరిస్తున్న మావోయిస్టు పార్టీ. దేశం లో అజ్ఞాతం గా పనిచేస్తున్న రెండు ప్రధాన మావోయిస్టు పార్టీలు కొన్ని సంవత్సరాలక్రితం విలీనం కాగలిగాయి కానీ ఎన్నికలలో పోటీ చేసే రెండు పార్టీలు మాత్రం విలీనం కాలేకపోయాయి వాళ్ళ విభేదాలు అట్లావుంటాయి . అట్లా బ్యాలెట్ కమ్యూనిస్టులపై బుల్లెట్ కమ్యూనిస్టులు ఒక పాయింట్ స్కోర్ చేశారు, ప్రస్తుతం గంగా తీరం నుంచి గోదావరి తీరం వరకు విస్తరించిన బీహార్ జార్ఖండ్ బెంగాల్ ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణ ఆంధ్రా సరిహద్దు వరకు మావోయిస్టు పార్టీ ప్రభావం ఉన్నది అదికూడా బలహీనమౌతున్నది . ఇంఫార్మర్ నెపంతో అనేకమందిని బడుగు బీద ప్రజలను కూడా హతమారుస్తున్నారు , వాళ్ళ లక్ష్యం బడుగు బీద ప్రజల సంక్షేమమేనా అనే ప్రశ్న అపుడప్పుడు ఎదురౌతూఉంటుంది,
1920 లో ప్రారంభమైన భారత కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్ర లో నక్సల్స్ దశ ప్రారంభమయ్యి 50 ఏళ్లు దాటి పోయింది, ఈ యాభై ఏళ్లలో ప్రపంచంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి, ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి కారణంగా గతితార్కిక వాదం, వర్గ పోరాటం , సాయుధ విప్లవం వంటి అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి , తరువాతి కాలంలో వచ్చిన యూరో కమ్యూనిజం న్యూ లెఫ్ట్, లాటిన్ అమెరికా బ్రాండ్ సోషలిస్టు ఉద్యమాలు, కమ్యూనిస్టు భావజాలం నుంచి బయటకు వచ్చాయి, 50 ఏళ్ళ క్రింద ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రారంభమైన మావోయిస్టు సేనలు చాలావరకు సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పాయి, భారత మావోయిస్టు పార్టీ కంటే పెద్దదైన కొలంబియా ఎఫ్ ఏ ఆర్ సి నాలుగేళ్ళ క్రిందనే సాధారణ జనజీవితం లోకి వచ్చేసింది, పట్టుమని పదివేల మందిగెరిల్లాలు లేని భారతదేశంలోని మావోయిస్టులు అత్యంత బలోపేతమైన లక్షలాది మంది సైనిక బలం కలిగిన భారత ప్రభుత్వం తో సాయుధ పోరాటం చేయటం అసంభవం, మైదాన ప్రాంతాలలో పూర్తి బలహీనమౌతున్నది , అసలు మావోయిస్టు లకు ప్రేరణ ఆదర్శం అయినా చైనా కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ సిద్ధం నుండి బయటకు వచ్చి పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రయాణం చేస్తూ ప్రపంచం లో అగ్రదేశం కావాలని తహతహలాడుతున్నది , ఒకరకంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి కాలదోషం పట్టింది , ఇంకో కోణంలో ఆలోచిస్తే భారతదేశం లాంటి విశాల దేశంలో సాయుధపోరాటం అసాధ్యం ఇటువంటి పరిస్థితుల్లో కొలంబియా లో మావోయిస్టు లు ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వెళ్లినట్లు భారత లో పని చేస్తున్న మావోయిస్టు లు ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలవటం దానికి ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయ మార్గం . ఇన్ని దశాబ్దాలుగా సాగుతున్నా మారణకాండ కు తెరదించి దేశం లో అంతర్గత సంఘర్షణకు ముగింపు పలుకుతారో వేచి చూడాలి.
Courtesy : Mallikarjun