
File Photo
ఆస్పత్రిలో ఉన్న నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు. మోదీజీ ఈ సమయంలో నా ప్రేమ మీకు ఉంటుంది. మీ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, చంద్రబాబు సహా పలువురు ఆమె స్వస్థతను కాంక్షిస్తూ ట్వీట్ చేశారు. బుధవారం అస్వస్థతకు గురైన హీరాబెన్ ను అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజి అండ్ రీసెర్చ్ సెంటర్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన వెంటనే మోదీ …హుటాహుటిన అహ్మదాబాద్ వచ్చి నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. గంటపాటు అక్కడే ఉన్నారు. తల్లి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి.
https://twitter.com/RahulGandhi/status/1608033631364345856?s=20&t=V0FJUEpKO0aAJI1yzPKysw