తాజాగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ముందుకొచ్చింది. భారత్ కు 110 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో భారత్ లోని మూడు స్వచ్ఛంద సంస్థలకు 15 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చినట్టు ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే తెలిపారు. ఎన్జీవో కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ కు ఈ మొత్తా్ని ఇచ్చినట్టు తెలిపారు. కేర్ ఎన్జీవోకు 10 మిలియన్ డాలర్లు, ఎయిడ్ ఇండియా, సేవాఇంటర్నేషనల్ కు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున విరాళమిచ్చారు.
తామిచ్చే విరాళాల ద్వారా సేవా ఇంటర్నేషనల్ ఎన్జీవో కోవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు కొనుగోలు చేస్తుంది. వాటిని భారత్ లోని ప్రభుత్వఆస్పత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాలకు పంపిణీచేస్తారు అని ట్విట్టర్ ఓ ప్రకటనలో తేలింది.