భారత తదుపరి ఆర్మీ చీఫ్ గా మనోజ్ పాండే పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే పదవీవిరమణ ఉండడంతో తదుపరి చీఫ్ గా పాండే పేరు దాదాపు ఖరారైంది. ఇక నరవణే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బాధ్యతలోకి వెళ్లే అవకాశం ఉంది. ఆ స్థానంలో ఉన్న జనరల్ బిపిన్ రావత్ ఇటీవల విమానప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 8న విమానం కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది సాయుధ సిబ్బంది మృతి చెందారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)