కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలకు పేరుగాంచిన కాలమిస్ట్ రషీద్ కిద్వాయ్, దివంగత మోతీలాల్ వోరాను కీర్తిస్తూ తన తాజా కథనంలో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇండియా టుడేలో ప్రచురించిన కాలమ్లో, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు క్షేత్రాల కేటాయింపు సమయంలో ఒక వ్యక్తి కోసం లాబీయింగ్ చేశారని అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ వేలెత్తి చూపిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాజీ కోశాధికారి మోతీలాల్ వోరాను ప్రశంసిస్తూ తాను రాసిన కథనంలో రషీద్ కిద్వాయ్ ఈ మాటలురాశారు.
నెహ్రూ-గాంధీ కుటుంబ విధేయుడి ప్రతిష్ట మసకబారుతుండడంతో, మోతీలాల్ వోరా నిరాడంబరతను.. కాంగ్రెస్ పార్టీకి అతని విధేయతను ప్రశంసిస్తూ రషీద్ కిద్వాయ్ ఈ వ్యాసం రాయడానికి ముందుకు వచ్చారు.
మోతీలాల్ వోరా ప్రాముఖ్యతను కీర్తించే ప్రయత్నంలో మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కంటే మోతీలాల్ వోరా ప్రాబల్యం కలిగి ఉన్నారని రషీద్ అన్నారు. తన వాదనను నిరూపించుకోవడానికి…బొగ్గు క్షేత్రాల కేటాయింపు సమయంలో మన్మోహన్ సింగ్ ఎవరికోసమో లాబీయింగ్ చేశారని కిద్వాయ్ అన్నారు.
“వోరా చాలా నిరాడంబరంగా ఉండేవారు. నాడు మన్మోహన్ సింగ్ ఒక మంత్రిని సంప్రదించి, బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించి తనకు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి పేరును సూచించినట్లు తెలిసింది. వోరా ద్వారా సూచన చేయమని ప్రధానికి చెప్పారు” అని రషీద్ కిద్వాయ్ ఇలా వ్రాశారు.
“వాస్తవానికి 2004 నుంచి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వోరా, అహ్మద్ పటేల్ నుంచి టెలిఫోన్ కాల్స్, మౌఖిక సందేశాలు అధికార కారిడార్లలో క్యాబినెట్ మంత్రులు, ప్రధాన మంత్రి కార్యాలయం కంటే ఎక్కువగా ఉన్నాయి” అని రాశారు.
https://twitter.com/amitmalviya/status/1538495891824185345?s=20&t=gin_I8uhJM_2zTViKhxQZg
యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం :
భారతీయ మీడియాలో కోల్గేట్ అని పిలిచే మెగా బొగ్గు కుంభకోణం మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగా మారింది. 200 బొగ్గు క్షేత్రాలను ప్రభుత్వం తక్కువ ధరలకు లీజుకు విక్రయించి కొద్దిమందికి లబ్ధి చేకూర్చడంతో సుమారు 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని 2012లో CAG వెల్లడించడంతో బొగ్గు క్షేత్రాల కేటాయింపులో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ఈ బొగ్గు కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయం కూడా స్కామ్ కిందకు వచ్చింది.