త్రిపుర సీఎంగా ఎంపీ డాక్టర్ మాణిక్ సాహాను ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. బిప్లబ్ కుమార్ దేబ్ రాజీనామా చేయడంతో కొత్త సీఎం పేరును పార్టీ ప్రకటించింది. మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
డెంటల్ వైద్యుడైన మాణిక్ ఈ ఏడాదే త్రిపుర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ముందు కాంగ్రెస్ లో ఉన్న ఆయన 2016లో బీజేపీలో చేరారు. 2020లో పార్టీ అధ్యక్షుడిగా నియమించింది హైకమాండ్.
మాణిక్ కు ట్విట్టర్ వేదిగ్గా శుభాకాంక్షలు తెలిపారు విప్లవ్. మోదీ విజన్- మాణిక్ నాయకత్వంలో త్రిపుర అభివృద్ధి పథంలో సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చేఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎంను మార్చి ప్రయోగం చేస్తోంది బీజేపీ. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశంతో విప్లవ్ రాజీనామా చేశారు. అనంతరం గవర్నర్ కు రాజీనామాసమర్పించారు. అంతకుముందు హోంమంత్రి అమిత్ షానూ కలిశారు. ఆ వెంటనే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలు కేంద్ర పరిశీలకులుగా అగర్తలా వెళ్లడం, ఎల్పీ లీడర్ గా మాణిక్ ఎన్నిక చకచకా జరిగిపోయాయి.