బోథ్ మండలంలోని నిరుపేద కుటుంబానికి చెందిన నగేష్ అనే యువకుడికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. నడుము భాగంలోని పక్కటెముక విరిగింది. ఆదిలాబాద్, యావత్మల్ హాస్పిటల్లో చేర్చారు బంధువులు. రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు వైద్యులు. పేదకుటుంబం కావడంతో దిక్కుతోచలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న వార్డ్ మెంబర్ షాకీర్ మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అనిల్ సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశారు. దీంతో శ్రీ ఆదిత్య హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి పరిస్థితిని గమనించి నగేష్ ని తమ హాస్పిటల్ కి రప్పించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆపరేషన్ కూడా చేశారు. హాస్పిటల్ లోనే 25 రోజులు డాక్టర్ కిరణ్ తో.. ఫిజియోథెరపీ కూడా చేయించారు. అతను కోలుకున్న తరువాత డిశ్చార్జ్ చేశారు.
దీంతో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ అనిల్ కుమార్,ఎంపీటీసీ షేక్ అబ్దుల్ ఆదిత్య హాస్పిటల్ లో డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి కు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి, డాక్టర్ కిరణ్ , డాక్టర్ సువర్ణ రెడ్డి, ఎం పి టి సి షేక్,అనిల్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.