భారతీయ జనతా పార్టీకి ఓటేసినందుకు భర్త తనను వేధిస్తున్నాడంటూ ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన ఓ మహిళ కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఫిర్యాదు చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు… తలాక్ చెప్తానని బెదిరించినట్టు ఆ మహిళ వాపోయింది. అంతే కాదు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడనీ ఆమె కన్నీటి పర్యంతమైంది.
బరేలీలోని ఎజాజ్ నగర్ గోటియాలో నివాసం ఉంటున్న తాహిర్ అన్సారీ కుమార్తె నజ్మా ఉలమా అన్సారీ… తస్లీమ్ అన్సారీని కుటుంబ సభ్యుల ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లిచేసుకుంది. 2021లో వారి పెళ్లి జరిగింది. బాధితురాలి భర్త, మామ ఎస్పీలో క్రియాశీలక కార్యకర్తలు.
భాజపా మహిళల కోసం ఎన్నో పనులు చేసిందని అందుకే బీజేపీకి ఓటేశానని..అయితే ఈ విషయం వాళ్లకు చెప్పడమే తన పాపమైందని ఆమె అంటోంది. కోపోద్రిక్తులైన భర్త, మామ తనను నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టాడని వాపోయింది. దీంతో ఆమె హక్కుల పోరాటకారులు మేరా హక్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఫర్హత్ నఖ్వీని ఆశ్రయించింది. ఫర్హత్ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సోదరి. త్రిపుల్ తలాక్ బాధితులకు తన ఎన్జీవో ద్వారా సాయం చేస్తోందామె. ఆమె సహకారంతో నఖ్వీనీకలిసింది బాధితురాలు. ఇరు కుటుంబాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని ..ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఫర్హత్ నక్వీ తెలిపారు.
https://twitter.com/Bhadourialive/status/1505757295711379466?s=20&t=QoVZG14qw-IcFGHSeTrgQg
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)