హిందూదేవీదేవుళ్లను పరిహాసం చేస్తున్న ఘటనలు పథకం ప్రకారం జరుతున్నట్టు అనిపిస్తోంది. హిందూదేవతల ఫొటో పేపర్లలో చికెన్ ను విక్రయిస్తున్న వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సంభాల్ పట్టణానికి చెందిన తాలిబ్ హుస్సేన్ తన దుకాణంలో చికెన్ను హిందూ దేవతల బొమ్మలు ఉన్న కాగితంపై చికెన్ పెట్టి అమ్ముతున్నాడని పలువురు ఫిర్యాదు చేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా అతని చర్యలున్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతని దుకాణానికి వెళ్లి చూశారు. ఆసమయంలో తాలిబ్ హుస్సేనే పోలీసులపైకి కత్తితో దాడికి ప్రయత్నించినట్టు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.