వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం సందర్భంగా కోల్ కతాలోహైడ్రామా చోటుచేసుకుంది. జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమంలో స్టేజిపైకి వెళ్లేందుకు మమత నిరాకరించారు. హౌరా-న్యూ జల్పాయ్గురిని అనుసంధానించే వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. హౌరా నుంచి రైలును ప్రారంభించే కార్యక్రమానికి మమతా బెనర్జీ హాజరు కాగా, కొందరు ‘జైశ్రీరామ్’ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీంతో సీఎం అసహనానికి గురయ్యారు. ఆమెను శాంత పరచేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ సీవీ ఆనంద బోస్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆడియన్స్ తో పాటు అలాగే కూర్చుండిపోయారు.