రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు పావులు కదుపుతున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పలు పార్టీలతో సమావేశం అవుతున్నారు.ఈ మేరకు ఒకరిద్దరు మినహా ముఖ్యమైన నాయకులకు ఆమె ఆహ్వానం పలికారు. అయితే సాయంత్రం జరిగే ఈ సమావేశానికి హాజరుకావద్దని ఆప్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇక మీటింగ్ కు
టీఆర్ఎస్ కూడా దూరంగా ఉంటోంది. కారణం మమత కాంగ్రెస్ కు ఆహ్వానం పంపడమే.కాంగ్రెస్ తో వేదిక పంచుకునే ప్రశ్నేలేదని టీఆర్ఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
అటు ఢిల్లీలో ఇవాళ జరిగే ప్రతిపక్షాల పార్టీల సమావేశానికి ఎంఐఎంను కూడా మమత ఆహ్వానించలేదు. మాజీ మంత్రి హెచ్డి దేవెగౌడ, ఆయన కుమారుడు, జనతాదళ్ నాయకుడు హెచ్డి కుమారస్వామి, రాష్ట్రీయ లోక్దళ్కు చెందిన జయంత్ చౌదరి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎంకే స్టాలిన్కు చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) తరపున టిఆర్బాలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, శివసేనకు చెందిన సుభాష్ దేశాయ్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి సమాజ్వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ కూడా హాజరుకానున్నాయి.