పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద ముంబైలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అసంపూర్ణంగా జాతీయగీతం ఆలపించారన్నది ఆరోపణ. కూర్చుని జాతీయ గీతాలాపన మొదలుపెట్టిన మమతా..పూర్తిగా పాడలేదంటూ వీడియోను ఫిర్యాదు కాపీకి జతచేశారు. ఆ వీడియో నిన్నటినుంచీ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై పర్యటనలో ఉన్న మమతా…నిన్న విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో జాతీయగీతం పాడడం మొదలుపెట్టిన మమత పూర్తిచేయలేదు. మమతా బెంగాల్ సంస్కృతిని, జాతీయ గీతాన్ని, దేశాన్ని, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ను అవమానించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
“మన జాతీయతకు ఒక శక్తివంతమైన ప్రదర్శన మన జాతీయ గీతం. అధికార పదవులలో ఉన్న నాయకులు దానిపట్ల గౌరవం చూపకపోయినా, అగౌరవం ప్రదర్శించరాదు.కానీ మమత తీరు బాధాకరం. అంటే ఈ దేశంలోని ప్రతిపక్షాలు మన దేశం పట్ల గౌరవం, దేశభక్తి ప్రదర్శించడానికి వెనుకాడుతున్నారా?” అని బిజెపి ఐటి సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవ్యా ట్వీట్ చేశారు. జాతీయ గీతంపట్ల మమతా బెనర్జీ ప్రవర్తన సిగ్గుచేటు అంటూ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు.
Here we have a Chief Minister, who fails to respect our National Anthem.
Expecting the opposition parties to respect Bharat & it's values is a lot to ask for these days.
This deplorable behaviour from a Constitutional Authority is extremely shameful & condemnable. pic.twitter.com/pamYZqAZEo
— Tejasvi Surya (@Tejasvi_Surya) December 1, 2021