తన పార్టీ షాహిద్ దివస్ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన జిహాద్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అసన్ సోల్లో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ జూలై 21 నుంచి బీజేపీకి వ్యతిరేకంగా జిహాద్ ప్రారంభించారని కార్యకర్తలకు,మద్దతుదారులకు పిలుపునిచ్చారు. వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుంటే కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. 2022 ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ తన వ్యాఖ్యను సమర్థించుకున్నారు.
కాషాయపార్టీకి వ్యతిరేకంగా జిహాద్ కు సిద్ధపడాలని ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులందరినీ చంపుతామని బెదిరిస్తున్నారా అని రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు టీఎంసీ లీడర్ చిత్రమైన జవాబిచ్చారు. “దేశంలో చాలా ప్రాంతీయ భాషలున్నాయి. ఉర్దూ, హిందీ ఒకేలా అనిపిస్తాయి. మరాఠీ, గుజరాతీ ఒకేలా ఉంటాయి. అలాగే బెంగాలీ, అస్సామీకి సారూప్యతలున్నాయి.మన స్థానిక భాషలో ‘జిహాద్’ అంటే తీవ్ర నిరసన అని అర్థం’’ అని వివరించారు.
మే 2021లో తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలు బిజెపి సృష్టించిన డ్రామా అని ఆమెఅన్నారు. ఇండియా టుడే ‘జర్నలిస్ట్’ రాజ్దీప్ సర్దేశాయ్తో ఆమె సంభాషణ అంతా బీజేపీకి తనకు జరుగుతున్న యుద్ధం గురించే ఉంది. మమతా జిహాద్ బెదిరింపులపై బీజేపీ రాష్ట్ర గవర్నర్ జగదీప్ థంకర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో గవర్నర్ ఆమెకు లేఖరాశారు. అప్రజాస్వామికమైన స్టేట్ మెంట్ ను, రాజ్యాంగ విరుద్ధమైన ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలనీ గవర్నర్ కోరారు.
ప్రతిపక్ష నాయకురాలు సువేందు అధికారి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు, ఆమె ద్వేషపూరిత ప్రసంగం ఆమె “జిహాదీ” ఆలోచనను సూచిస్తోందని అన్నారు. ప్రత్యర్థి పార్టీపై హింసకు పిలుపునిచ్చినందుకు బెనర్జీని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తన ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని బిజెపికి వ్యతిరేకంగా ‘జిహాద్’ కోసం విజ్ఞప్తి చేశారనిసువేందు అన్నారు. “ఇది ఆమె ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగం. ఆమె బెంగాల్లో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకునేలా ఇస్లామిస్ట్, ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించింది. ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా జిహాద్కు పిలుపునిచ్చింది, ”అని ఆయన అన్నారు. 1946లో ముస్లిం లీగ్కు చెందిన పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా హిందువులపై భయంకరమైన “డైరెక్ట్ యాక్షన్ డే”ని ప్రారంభించిన సరిగ్గా అదే రోజున మమతా బెనర్జీ కూడా తన “ఖేలా హోబే దివస్” ప్రారంభించారని బీజేపీ రాష్ట్రపార్టీ గుర్తుచేస్తోంది.
అసలైతే మొదట్లో ఈ నినాదాన్ని మొదట్లో బీజేపీ సీరియస్ గా తీసుకోలేదు. ఎన్నికల సందర్భంగా కూడా మోదీని, బీజేపీని అపహాస్యం చేసేలా వాల్ పోస్టర్లు, కార్టూన్లు వేయించింది టీఎంసీ. మమతా బెనర్జీ ఫుట్ బాల్ కు బదులుగా మోదీ తలను కాలితో తన్నుతున్నట్టున్న పోస్టర్ ఆప్పట్లే దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇక ప్రతీసందర్భంలో కార్యకర్తలను రెచ్చగొడుతూ బీజేపీ కార్యకర్తలపై దాడులకు ప్రేరేపించేలా మమతా చేష్టలున్నాయని బీజేపీ ఎప్పటికప్పుడు వాపోతోంది. ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. పోలింగ్ సందర్భంగా జరిగిన అనేక హింసాత్మక ఘటనల్ని దేశమంతా చూసింది. TMC గూండాలు బీజేపీ మద్దతుదారులను హత్య చేయడం, దోచుకోవడం, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలూ మీడియాలో వచ్చాయి.