పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ బంగ్లా అకాడమీ అవార్డు సీఎం మమతా బెనర్జీని వరిచింది. ఆమె రాసిన కబితా బితాన్ పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశారు. ఆమె స్వయంగా రాసిన 946 కవితలున్న పుస్తకం అది. 2020లో కోల్కతా బుక్ ఫెయిర్లో ఆ పుస్తకావిష్కరణ జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సమాచార, సాంస్కృతిక శాఖ నిర్వహించిన ‘కవి ప్రాణం’ కార్యక్రమంలో మమతా బెనర్జీకి ఈ అవార్డును అందజేశారు. అయితే ఈకార్యక్రమానికి మమతా హాజరైనా ఆ అవార్డును ఆమె స్వీకరించలేదు. మమతా తరపున రాష్ట్ర విద్యామంత్రి బ్రత్యాబసు ఈ అవార్డును అందుకున్నారు.రాష్ట్రంలోని ఉత్తమ రచయిత్రుల బృందం మమత పేరును ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు
సాహితీరంగంలో మమత విశేష సేవ చేశారని ఈ సందర్భంగా అకాడమీ అభివర్ణించింది. అయితే మమతకు ఈ అవార్డు ప్రకటించడంపై బీజేపీ ఎద్దేవా చేసింది. రాష్ట్ర విద్యామంత్రి మంత్రి బ్రత్యా బసు బంగ్లా అకాడమీ చైర్మన్.