ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో భారీ స్కాంకు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన తన కేబినెట్ మంత్రి పార్థాచటర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈడీ చేసిన సోదాల్లో 21 కోట్ల రూపాయల నగదు దొరికిన సంగతి తెలిసిందే. పార్థా అరెస్ట్ జరిగిన రెండు రోజులకు స్పందించిన ఆమె..అతను దోషి అని తేలితే జీవితఖైదు వేసుకోండని అన్నారు. అంతేతప్ప ఎవరైనా సరే అవినీతిని సహించబోనని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా నిజం నిగ్గు తేలాలనీ ఆమె అన్నారు. మంత్రి పార్థా ఛటర్జీ సహాయకురాలు, నటి, మోడల్ అర్పితా ముఖర్జీ ఇంట్లో 21 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గతంలో విద్యామంత్రిగా ఉండగా నియామకాల్లో భారీ అవినీతి జరిగింది.