ముస్లిం మహిళల హక్కులకోసం పోరాడే నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా కూడా కర్నాటక హిజాబ్ అంశంపై స్పందించింది. సపోర్టుగా…. ఆమెకు నోబుల్ బహుమతి ఇచ్చే నార్వే బుర్ఖాను, హిజాబును నిషేధించాయి. అంటే ప్రపంచంలో ఎక్కడేం జరిగినా వీళ్లకు పట్టదు. చైనాలో ఉయ్గుర్ ముస్లింల ఊచకోతా పట్టదు. కానీ భారత్ లో ఏదైనా జరిగితే చాలు ఇక్కడకొచ్చి వాలి కావాలని రచ్చ చేస్తుంటారు. ఇస్లాం పుట్టిన సౌదీ అరేబియా లో మతోన్మాద భావజాలం నుంచి మహిళలు బయటకు వస్తున్నారు. ఇస్లామిక్ కంట్రీస్ లో బుర్ఖా వద్దని ఆందోళనలు చేస్తున్నారు. తమకు స్వేచ్ఛ కావాలని గొంతెత్తుతున్నారు. ఆశ్చర్యంగా ఇక్కడ మటుకు సౌదీలో ఏవైతే రద్దుచేస్తున్నారో అవే కావాలని ధర్నాలు చేయడం విచిత్రం..