రెండు రోజుల క్రితం ఉగ్రవాదులచేతిలో హత్యకు గురైన మఖన్ లాల్ బింద్రూ పేరును శ్రీనగర్ లోని ఓ రహదారికి పెట్టారు.
ఆ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు
శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (SMC) మేయర్ జువానీద్ మట్టూ ఒక తెలిపారు. ఇదే ఆయనకు నివాళి అంటూ ట్వీట్ చేశారుచినార్ చౌక్ నుంచి జహంగీర్ చౌక్ వరకు ఉన్న రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. బింద్రా మెడికల్ షాపు ఉన్నది ఆ రోడ్డులోనే. శ్రీనగర్ సమీపంలోని ఇక్బాల్ పార్క్ దగ్గర షాపు నిర్వహించే బింద్రూ స్థానికులందరితీ తలలో నాలికగా ఉండేవాడు. 1990లల్లో అక్కడినుంచి తన బంధుమిత్రులు, ఇరుగుపొరుగు కశ్మీర్ ను వీడి దేశం నలువైపులకూ వెళ్లారు. అందరూ అక్కడ ఉండలేక ప్రాణాలు అరచేత బట్టుకుని అందరూ వెళ్లినా ధైర్యంగా జన్మభూమిని వీడలేదు బింద్రూ.అక్కడే మెడికల్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. మఖన్ లాల్ కుమారుడు డాక్టర్. తన షాపు ఉన్న మొదటి అంతస్తులోనే చిన్న క్లినిక్ ఏర్పాటు చేశాడు. స్థానికంగా ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునేందుకు ఆ కుటుంబం ముందుండేది. అలాంటివ్యక్తిని రెండురోజుల క్రితం ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు.
ఆర్టికల్ 370 ఎత్తివేతతో జమ్ముకశ్మీర్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయని అందరూ భావించారు. దశాబ్దాల క్రితం వలస వెళ్లిన పండిట్లు తిరిగి వస్తారనీ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సామాన్యులపై ముఖ్యంగా కశ్మీర్ పండిట్లపై ఉగ్రమూక దుశ్చర్యలు కలకలం రేపుతున్నాయి.