మహాత్మా జ్యోతి రావు ఫూలే 196వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ లో బీసీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంటరానితనం నిర్మూలన, మహిళాజనోద్ధరణ వారి అక్షరాస్యత కోసం ఆయన అలుపెరగని కృషిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో obc మోర్చ జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్ , obc మోర్చా రాష్ట్ర కార్యదర్శి గటిక క్రాంతి కుమార్, BJYM రాష్ట్ర కార్యదర్శి సంతోష్ వేణుగోపాల్, గంగన్న, మోహన్ అగర్వాల్, కాంత , సతీష్ ,రామకృష్ణ పాల్గొన్నారు