మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేత, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
“నేను ప్రభుత్వం నుంచి దూరంగా ఉంటాను, అది సజావుగా సాగేలా చూస్తాను” అని ఫడ్నవీస్ చెప్పారు. షిండే రాత్రి 7:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. ఈరోజు ఇతర మంత్రులెవరూ ప్రమాణస్వీకారం చేయరని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ, దేవేంద్ర ఫడ్నవీస్ సహా ఇతర బీజేపీ నేతలకు ఏక్నాథ్ షిండే ధన్యవాదాలు తెలిపారు. “ఇది వారి గొప్పతనం. వారికి పెద్ద మెజారిటీ ఉంది, అయినప్పటికీ వారు నన్ను ముఖ్యమంత్రిని చేసారు. అలా ఎవరు చేస్తారు?”అని ఏక్నాథ్ షిండే అన్నారు.
షిండే గోవా నుంచి ముంబైకి వచ్చి ఫడ్నవీస్ను ఆయన నివాసంలో కలిశారు. నేడు షిండే మాత్రమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షిండే, ఫడ్నవీస్లు రాజ్భవన్కు చేరుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిశారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 144. అయితే ఈరోజు తెల్లవారుజామున మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి.