మహారాష్ట్ర రవాణా మంత్రి, శివసేన నాయకుడు అనిల్ పరబ్ జూన్ 21న ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఏజెన్సీ ఆయనకు సమన్లు జారీ చేసింది.
అంతకుముందు, జూన్ 15న ఈ కేసులో ఈడీ అధికారులు అనిల్ పరాబ్కు సమన్లు పంపారు, అయితే శివసేన నాయకుడు హాజరుకాలేదు, అతను ప్రయాణిస్తున్నాడని స్థానికకంగా లేనని పేర్కొన్నాడు. అయితే తర్వాత ఎపుడైనా ఏజెన్సీ కోరినప్పుడు ఈడీ ఎదుట హాజరవుతానని చెప్పారు. రత్నగిరిలోని దాపోలిలో నిర్మించిన రిసార్ట్కు సంబంధించి అనిల్ పరాబ్పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ జరిగింది.
మే 26న ముంబైలోని అనిల్ పరాబ్ అధికారిక, వ్యక్తిగత నివాసం తోపాటు ముంబై, పూణే, దాపోలీలోని అతని సన్నిహితులకు చెందిన స్థలాలతో పాటు పలు ప్రదేశాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనిల్ పరాబ్ సన్నిహితులు కొందరిని ఇంతకుముందు ఈడీ ప్రశ్నించింది.
CRZ(కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనలను ఉల్లంఘించి అనిల్ పరబ్ రత్నగిరిలోని దాపోలిలో నిర్మించిన రిసార్ట్కు సంబంధించి మనీలాండరింగ్ కేసు నమోదైంది.