మహారాష్ట్ర చీఫ్ ఏక్నాథ్ షిండే ఇవాళ ఉదయం టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య భేటీకి సరైన కారణం వెల్లడికాలేదు.
ముంబైలోని కోలాబాలోని ఆయన నివాసంలో రతన్ టాటాను కలిశానని సీఎం ఏక్నాథ్ షిండే తన ట్విట్టర్లో తెలిపారు. “మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు రతన్ టాటా నన్ను హృదయపూర్వకంగా అభినందించారు. ముఖ్యమంత్రిగా నా కెరీర్ లో మంచి జరగాలని ఆకాంక్షించారు” అని సీఎం ఏక్నాథ్ షిండే ట్వీట్ చేశారు.
https://twitter.com/mieknathshinde/status/1552188314983096322?s=20&t=JFdgT-ykavIiyjzNJU0Muw
సమావేశానంతరం సీఎం షిండే విలేకరులతో మాట్లాడుతూ.. రతన్ టాటా ఆరోగ్యంపై ఆరా తీసేందుకు ఆయనను సందర్శించినట్లు తెలిపారు.