కర్ణాటకతో సరిహద్దు విషయంలో మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఏకగ్రీవ తీర్మానం చేసింది. కర్ణాటకతో సరిహద్దుల ప్రాంతంలో నివసిస్తున్న మరాఠీ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఒక తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం సభకు హామీ ఇస్తూ, ఒక్క అంగుళం భూమిని కూడా తాము వదులుకునేదన్నారు. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రజలకు న్యాయం జరిగేందుకు ఏమి చేయాల్సి వచ్చినా చేస్తామని చెప్పారు.ఆసక్తికరంగా, అటు కర్ణాటక అసెంబ్లీలోనూ సరిహద్దు వివాదం విషయంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారంనాడు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు.