2020 పాల్ఘర్ సాధువుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉండగా ఈ ఘటన జరిగింది. 2020 ఏప్రిల్ 16న జునా అఖాడాకు చెందిన ఇద్దరు సాధువులు చిక్నే మహారాజ్ కల్పవృక్షగిరి (70), మరియు సుశీల్గిరి మహారాజ్ (35) సహా వారి 30ఏళ్ల డ్రైవర్ ను కొందరు దుండగులు విచక్షణారహితంగా కొట్టి చంపారు. పాల్ఘర్ జిల్లా గడ్చించలే గ్రామంలో ఈ ఘటనజరిగింది. ఆ సాధువులు సూరత్ వెళ్తుండగా..పోలీసుల సమక్షంలో వారిపై మూకదాడి జరిగింది. అయితే సాధువులను రక్షించేందుకు వెళ్లిన తమపైనా గుంపు దాడి చేసిందని పోలీసులు ముందు పేర్కొన్నారు. కానీ వారి వాదన తప్పని తరువాత బయటపడిన వీడియోల ద్వారా తెలిసింది. పోలీసులు దాడి జరుగుతుంటే ప్రతిఘటించలేదని ఆ వీడియోల్లో స్పష్టంగా ఉంది. సాధువులుకనుకే వారిపై ఈ క్రూరమైన చర్యకు దుండగులు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లను తోసిపుచ్చుతూ ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత కేసును సీబీఐకి బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. పాల్ఘర్లో హిందూ సాధువులను దారుణంగా కొట్టి చంపిన కేసులో సీబీఐ, ఎన్ఐఏ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై అప్పటి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం నుంచి స్పందన కోరిన కొద్ది రోజుల తర్వాత సుప్రీంకోర్టు అఫిడవిట్ సమర్పించింది.
https://twitter.com/ANI/status/1579724055837802496?s=20&t=bpIG2seNaK18JifSZVzvGw