ప్రయాగరాజ్ లో కుంభమేళా సందడి నెలకొంది. 12 ఏళ్లకోసారి కుంభమేళా జరిగితే… మూడేళ్లకు, ఆరేళ్లకుజరిగే వాటిని అర్థకుంభమేళాలు అంటారు. ఇక ప్రతిఏటా మాఘమాసంలో కూడా మాఘమేళా జరుగుతుంటుంది. ఈ సారి జనవర్ 6నుంచి మొదలైన మాఘమేళ ఫిబ్రవరి 19 వరకు కొనసాగనుంది. కోట్లాదిమంది భక్తులు మాఘమేళాకు తరలివచ్చి త్రివేణీసంగమస్థానంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా సాధుసంతులతో ప్రయాగరాజ్ కిటకిటలాడుతోంది. తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా దక్షిణాదిరాష్ట్రాలనుంచి కూడా భక్తులు చేరుకుని మాఘస్నానాలు చేస్తున్నారు.