అటు కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు..దేశంలో రెండోదశ కోవిడ్ వ్యాప్తికి ఈసీదే బాధ్యతంది.
”ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి. విధులను సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం చెందడంపై ప్రాసిక్యూట్ చేయాలి” అంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపంలో ముంచుకొస్తుంటే…ఎన్నికల ర్యాలీలను ఎందుకు నిరోధించలేదని..రాజకీయ పార్టీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా మిన్నకుండిపోవడం ఏంటని నిలదీసింది. ఓట్ల లెక్కింపు రోజైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు సూచించిది. ఈనెల 6న ఒకే విడతలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది