కశ్మీర్ మారణహోమంలో బలైన హిందువులకు దేశప్రజలు తమకు తోచినరీతిలో నివాళులు అర్పిస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ద్వారా వాస్తవ చరిత్రను తెలుసుకున్నామంటూ ఉద్వేగం చెందుతున్నారు. మధ్యప్రదేశ్ విదిషకు చెందిన మంజు సోని తన రక్తంతో మూవీ పోస్టర్ ను పెయింటింగ్ వేసిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆహ్వానం మేరకు మధ్యప్రదేశ్ వెళ్లిన వివేక్ రంజన్ భోపాల్లోని కశ్మీరీ పండిట్లను కలిశారు.
30 నాడు పుట్టిన నేలనుంచి దూరమై భోపాల్లో స్థిరపడిన వాళ్లంతా వివేక్ ను చూసి చాలా ఎమోషన్ అయ్యారు. ఆయన సైతం వాళ్ల మనోవేదను, వారు పడిన బాధలు, అనుభవాలు విన్నారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సీఎం చేపట్టిన వన్ ప్లాంట్ ఎ డే #OnePlantAday మిషన్ కింద కశ్మీర్ మారణహోమంలో చనిపోయిన, అలాగే బాధితుల జ్ఞాపకార్థం మొక్కలు నాటారు. వివేక్ రంజన్ కోరికమేరకు పండిట్లూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక వివేక్ అగ్నిహోత్రి సూచన మేరకు మొక్కలకు శివ, శారదతో పాటు కశ్మీర్ కోసం పోరాడుతూ బలిదానమైన జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ పేర్లను పెట్టారు సీఎం చౌహన్.