హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి బిజెపి తరఫున పోటీ చేసిన మాధవి లత చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా డిజిటల్ మాధ్యమాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆమెకు మద్దతుగా ట్విట్ చేశారంటే ఈ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
హిందుత్వ, భారతీయ విలువలు గురించి తరచు మాట్లాడడం ఆమె కు అలవాటు . అంతేకాకుండా క్రమం తప్పకుండా హిందూ కార్యక్రమాలకు హాజరవుతూ క్రేజ్ పెంచుకున్నారు. ఒవైసీ సోదరుల మీద మాటల తూటలు వదులుతూ పాతబస్తీలో దూసుకెళ్లిపోయారు. ఒకానొక దశలో మాధవి లత గెలుపు గ్యారెంటీ అంటూ టాక్ నడిచింది. ఎప్పుడూ లేనిది ఓవైసీ సోదరులు హైదరాబాద్ పాతబస్తీలో వీధి వీధి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. దీనిని బట్టి ఓవైసీ టీంలో కంగారు మొదలైంది అని అర్థం చేసుకోవచ్చు. హిందూ ఓట్లను కూడా కలుపుకోవడం కోసం గుళ్ళు గోపురాలు చుట్టూ ఒవైసీ తిరిగారంటే మ్యాటర్ అర్థం అవుతుంది.
అంతమాత్రాన హైదరాబాద్ ఎంపీ సీటు గెలుచుకోవడం అంత తేలిక కాదు. 2009కి ముందు పరిస్థితి వేరు ,, అప్పట్లో నాలుగు పాతబస్తీ ఎమ్మెల్యే సీట్లు ఉంటే మూడు తెలంగాణ రూరల్ నియోజకవర్గాలు ఉండేవి. దీంతో ఒవైసీ కుటుంబానికి కాస్తంత ఇబ్బంది ఏర్పడేది. కానీ 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదులోని ఏడు ముస్లిం నియోజకవర్గాలను స్పష్టంగా వేరుచేసి, మజ్లిస్ ఎంపీ సీటు కింద ఇచ్చేశారు. అప్పటినుంచి హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గంలో ఎంఐఎం గెలుపు అనేది నల్లేరు మీద నడక అయిపోయింది. కానీ ఇంత కాలానికి మజ్లిస్ పార్టీకి మాధవి లత రూపంలో గట్టి షాక్ తగిలింది.
ఇక్కడే మాధవి లత మరొక సేఫ్ గేమ్ ఎంచుకున్నారు అని చెప్తున్నారు. హైదరాబాదులో సాధ్యమైన ఎక్కువ ఓట్లు రాబట్టినట్లయితే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. లక్కీగా గెలుపు సాధిస్తే దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించి కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవచ్చు. లేకపోయినా సాధ్యమైన ఎక్కువ ఓట్లు రాబట్టినట్లయితే వచ్చేసారి ఎంపీ సీటుకి డోకా లేకుండా చేసి పెట్టుకోవచ్చు. ఈలోగా నియోజకవర్గం పునర్విభజనలో ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గాలు కొన్ని పక్కకు జరిగితే పరిస్థితి తేలికవుతుంది.
ఇదంతా పక్కన పెడితే హైదరాబాద్ నగరానికి 2020లో కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మేయర్ పదవిని మహిళలకు రిజర్వ్ చేశారు. అంటే ఈసారి వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈసారి కూడా మేయర్ పదవి మహిళలకే ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటప్పుడు హైదరాబాద్ అంతటా పూర్తి స్థాయిలో క్రేజీ సంపాదించుకున్న మాధవి లత రంగంలోకి దిగితే మేయర్ స్థానాన్ని దక్కించుకోవచ్చు. అదే ఊపులో ఎక్కువ కార్పొరేటర్ స్థానాలను బిజెపి గెలుచుకోవచ్చు. బిజెపి పార్టీలో మాధవి లత స్థానం బలపడటానికి ఇది ఒక అవకాశం. తర్వాత కాలంలో తేలికగా ఎంపీగా ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుంది.