అమెరికా మాజీ మొదటి మహిళ మిచెల్ ఒబామా పై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ గా మిచెల్ పోటీ చేయాలని..ఆమెను శ్వేతసౌధంలో చూడాలనుకుంటున్నట్టున్నానని ట్విట్టర్ వేదిగ్గా తన కోరికను బయటపెట్టారు. “మిచేల్ మేడం, నేనేం యువకుడిని కాను. సరదాకోసం ఈ ట్వీట్ చేయడానికి. 77 ఏళ్ల రచయితను. భారతదేశమంతటికీ నేను తెలుసు. నా ఈ మాటల్ని సీరియస్ గా తీసుకొండి. కేవలం అమెరికానే కాదు ప్రపంచం మొత్తం మిమ్మల్ని శ్వేతసౌధంలో చూడాలనుకుంటోంది. మీరీ విషయాన్ని మరిచిపోవద్దు ‘అని ఆమె ట్వీట్ కు రీట్వీట్ చేస్తూ…మనసులోని మాటను చెప్పుకున్నారు అక్తర్.
తాను త్వరలో ది లైట్ వి కేరీ పేరుతో వినోదయాత్ర చేస్తున్నట్టు మిచెల్ ట్వీట్ చేశారు. వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా.షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో మీదుగా తన టూర్ సాగుతుందని ట్వీట్ చేయగా దానికిలా రీట్వీట్ చేశారు అక్తర్.
https://twitter.com/Javedakhtarjadu/status/1577911630762897410?s=20&t=5Z1a_VwFX_gtf-Vc-YC62g