అదృష్టవంతుడిని అడ్డుకోను లేము,, దురదృష్టవంతుడిని బాగు చేయలేం అని ఒక సామెత చెబుతుంటారు. దీని ప్రకారం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొందరు అదృష్టవంతులు కనిపిస్తారు. అటువంటి వారిలో సీనియర్ రాజకీయ నాయకులు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు.
ఇక్కడ మరో సామెత కూడా గుర్తు చేసుకోవాలి రాజకీయాలు హత్యలు తక్కువ ఆత్మహత్యలు ఎక్కువ. ఎందుకంటే రాజకీయాల్లో తీసుకునే నిర్ణయం ఆధారంగా కొందరు వ్యక్తులు ఉన్నత స్థితికి చేరుతూ ఉంటారు మరికొందరు పాతాళంలో పడిపోతూ ఉంటారు. ఆనం రామనారాయణ రెడ్డి తెలివిగా తీసుకునే నిర్ణయాలతో ఎప్పుడూ లైమ్ లైట్లో నిలుస్తూ ఉండడం గమనార్హం.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి పెద్ద పేరు ఉన్నది. వాస్తవానికి ఆనం రామనారాయణరెడ్డి పెదనాన్న రాజకీయాలు నడుపుతూ ఉండేవారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి అప్పటి ప్రజల మూడ్ గమనించుకొని తెలుగుదేశం పార్టీలో ఎన్టి రామారావుకి వీర విధేయుడిగా మారారు. దీంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే తో పాటు కీలక పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత కాలంలో ప్రజల మూడ్ గమనించుకుంటూ నెమ్మదిగా టిడిపిలో ప్రాధాన్యతను తగ్గించుకున్నారు.
2004లో కాంగ్రెస్ పార్టీకి బలమైన వేవ్ వచ్చినప్పుడు.. ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలుపొందారు వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయుడిగా మారి మంత్రి పదవిని సంపాదించుకున్నారు. నిజానికి అప్పటికి ఆయన అన్నయ్య ఆనం వివేకానంద రెడ్డి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ,, హై కమాండ్ దగ్గర తమ్ముడు రామ్ నారాయణ రెడ్డి కి మంచి మార్కులు పడ్డాయి. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రోశయ్య ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా వ్యవహరించారు. అసెంబ్లీలో తెలుగుదేశాన్ని కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించే వారు. ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టారు.
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ప్రజల మూడ్ గమనించి .. తెలివిగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో టిడిపి మీద విధానపరమైన ఆరోపణలు చేయడమే తప్ప,, వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదు కాబట్టి టిడిపిలో ప్రశాంతంగా ఇమిడిపోయారు.
2019 వచ్చేసరికి ప్రజల మూడ్ మారింది అని గమనించి, జాగ్రత్తగా వైసీపీ లోకి అడుగుపెట్టి పార్టీ టికెట్ తెచ్చుకుని మరోసారి వైసిపి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. ఈసారి కూడా ఆయన అదే జాగ్రత్త పాటించారు. టిడిపిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వైసీపీ విమర్శించారు కాబట్టి,, కొత్తగా సమస్య లేకుండా ఈ పార్టీలోకి వచ్చేయ గలిగా రు. 2019 24 మధ్య వైసీపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా రాజకీయాన్ని ప్రభావితం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీని పెద్ద గా విమర్శించిన పాపాన పోలేదు. ఈ వైఖరి ఆయనకి మరోసారి కలిసి వచ్చింది.
2023లో ప్రజల మూడ్ మారింది అని గమనించి జాగ్రత్తగా వైసీపీకి గుడ్ బాయ్ కొట్టేశారు. తిరిగి మాతృ సంస్థ తెలుగుదేశంలోకి వెళ్లిపోయి 2024లో టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
నెమ్మది అయిన వైఖరి భక్తి భావం ఎక్కువ కలిగిన వ్యక్తి కావడంతో.. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి పదవి కూడా దక్కింది. ఇప్పుడు సీనియర్ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు.
తెలుగుదేశంలో మొదలుపెట్టి కాంగ్రెస్కు వెళ్లి తిరిగి టిడిపి కి వచ్చారు. మళ్లీ బయటకు వచ్చి వైసీపీలో చేరి అక్కడి నుంచి మళ్లీ వెనక్కు వచ్చి తెలుగుదేశంలో స్థిరపడ్డారు.
ఇన్ని పార్టీలు మారుతున్నప్పటికీ ఎప్పుడూ అధికార పార్టీ ఎమ్మెల్యే గాని నిలవడం ఆనం నారాయణరెడ్డి గొప్పతనం. మరో విశేషం ఏంటంటే ఈ 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన నాలుగు నియోజకవర్గాలను మార్చారు. గెలిచే పార్టీ గెలిచే నియోజకవర్గం వెతుక్కుని అటువైపు వెళ్లడం ఆయనకు అలవాటు. అంతమాత్రాన అహంకారం ప్రదర్శించకపోవడం,, సౌమ్యతతో ప్రజలకు అందుబాటులో ఉండడం ఆనం రామనారాయణరెడ్డి వైఖరి. దీంతో ఆయన ఎన్ని పార్టీలు మారినా ఎన్ని నియోజకవర్గాలు మార్చుకున్న ప్రజలు మాత్రం ఆదరిస్తూనే ఉంటారు. అందుకే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పటికీ విజేత ఎమ్మెల్యే అంటే ఆనం రామనారాయణ రెడ్డి.