ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో లవ్ జిహాద్ కు బ్రేక్ పడింది. కొన్ని నెలల క్రితం ఇంటిదగ్గర మిస్ అయిపోయిన అమ్మాయి ఎంత వెతికినా దొరకలేదు పోలీసులు కూడా కొంతమేర ప్రయత్నించి ఆగిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాలతో తిరిగి పోలీసు యంత్రాంగం కదిలింది. దేశ సరిహద్దులు దాటించే సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయిని పోలీసులు ట్రేస్ చేశారు. దీంతో ఆ అమ్మాయి జీవితం నిలబడింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపించిన అభిమానానికి కుటుంబ సభ్యులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంత మొత్తుకున్నా వినకుండా తన కూతురు మోసగాడు మాయలో పడిపోయింది అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. భీమవరానికి చెందిన ప్రభాకరరావు, శివకుమారి దంపతుల కుమార్తె తేజస్విని విజయవాడలోని పెద్దమ్మ వద్ద ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ చదువుతోంది. నిడమానూరుకు చెందిన అంజాద్ మాయమాటల్లో పడింది. ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి 9 నెలల కిందట యువతిని హైదరాబాద్ తీసుకెళ్లాడు. చేతిలో డబ్బు లేకపోవడంతో యువతి వద్ద ఉన్న నగలు, ఫోన్ అమ్మేశాడు. అక్కడ నుంచి బెంగళూరు, ముంబై,కేరళ వెళ్లారు. ఆ తరవాత యువతిని తీసుకుని జమ్ము కశ్మీర్ వెళ్లాడు.
Pawan Kalyan is not only a tall leader but a great HINDU warrior too
When a helpless mother met Deputy CM Pawan Kalyan & shared her pain of her missing daughter in an alleged
Love jihad case during PRAJA DARBAR,he immediately took it up, spoke to police & rescued the Andhra… pic.twitter.com/qsGFZsUsaD
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) July 4, 2024
అక్కడ ఓ హోటల్లో పనికి కుదిరాడు. 8 నెలలుగా అక్కడే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారని పోలీసుల విచారణలో తేలింది.
తేజస్విని తల్లిదండ్రులు, అక్కతో మాట్లాడకుండా జాగ్రత్తపడ్డ అంజాద్, ఆమెకు ఫోన్ అందకుండా చేశాడు. ఓ రోజు రాత్రి అతడు బయటకు వెళ్లిన సమయంలో అంజాద్ ఫోన్ నుంచి తేజస్విని, ఆమె అక్కకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టింది. తేజస్విని అక్క ఫోన్కు వచ్చిన మెసేజ్ను విజయవాడ మాచవరం పోలీసులకు చూపడంతో అంజాద్ జమ్మూలో ఉన్నట్లు గుర్తించి, అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. వారు వెంటనే అంజాద్ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో వారిని బుధవారంనాడు విజయవాడకు తరలించారు. అంజాద్ను విచారించిన తరవాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది.
ఇప్పటికే అంజాద్ కొంతమందిని ప్రేమ పేరుతో వలలో వేసుకుని మాయం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో తేజస్విని పట్టుకోగలడంతో ప్రమాదం తప్పింది, లేని పక్షంలో సరిహద్దు దాటి వేసి ఉంటే దారుణమైన పరిస్థితి ఎదురై ఉండేది.