నోటిఫికేషన్ రాకముందే పంజాబ్ లో ఎన్నికల కోలాహలం నెలకొంది. అన్ని పార్టీలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక నేతల ఫిరాయింపులూ జోరందుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్తపార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ లోకి చేరికలు ఊపందుకుంటున్నాయి.
తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ అమ్రిక్ సింగ్ అలివాల్, మాజీ శాసనభ్యులు హర్జిందర్సింగ్ తేకేదార్, ప్రేమ్ మిట్టల్, ఫర్జానా ఆలం, రజ్వీందర్ కౌర్ భగీకేతోపాటు పలువురు స్థానిక నేతలు పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.