తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ .. కొన్ని నియోజకవర్గాల ముఖచిత్రం స్పష్టమవుతోంది. అందులో ఆదిలాబాద్ కూడా ఒకటి. 2019 ఎన్నికల్లో ఇక్కడ బిజెపి విజయం సాధించడంతో కమలం పార్టీకి ఇది సిట్టింగ్ స్థానంగా మారింది.
అదిలాబాద్ లో బిజెపి ఎంపీ అభ్యర్థి పేరు ప్రకటించిన తరువాత ప్రచారం మెల్ల మెల్లగా మొదలై , తర్వాత జోరు అందుకుంది.
అదిలాబాద్ జిల్లాలో సిట్టింగ్ అభ్యర్థిని కాదని గోడం నగేష్ ని అభ్యర్థిగా ప్రకటించింది.
బీజేపీ టికెట్ కోసం చివరి వరకు ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు ప్రయత్నం చేశారు. అలాగే సీనియర్ నేతలు
రాథోడ్ రమేష్, రాథోడ్ బాపురావ్ పోటీ పడినప్పటికీ, అవకాశం దక్కలేదు,
రెబెల్ అభ్యర్థిగా పోటీలో ఉంటాను అన్న సోయం బాపురావు కు అధినాయకత్వం భరోసా కల్పించడంతో చల్లబడ్డారు. అలాగే రాథోడ్ రమేష్ కూడా పార్టీ నాయకత్వం సూచనలతో వెనక్కి తగ్గారు.
అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ముందుగా సీనియర్లను కలుసుకున్నారు. అలాగే టిక్కెట్ కోసం పోటీపడిన నేతలను కూడా కలుసుకొని దగ్గర చేసుకున్నారు. నాయకులు, కార్యకర్తలని కలుస్తూ ప్రచారంలో ముందుకు వెళుతున్నారు.
అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో నాలుగు నియోజకవర్గాలైన నిర్మల్, ముధోల్, అదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ లలో బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నారు.
బోథ్, ఆసిఫాబాద్ లో భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే లు ఉన్నారు, ఖానాపూర్ లో కాంగ్రెస్ ఎంఎల్ఏ ఉన్నారు.
అదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల బల బలాలు ఒకసారి పరిశీలించినట్లు అయితే
బీజేపీ నుండి గోడం నగేష్ ,
కాంగ్రెస్ నుండి ఆత్రం సుగుణ,
భారతీయ రాష్ట్ర సమితి నుండి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు.
అదిలాబాదులో మూడు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ బిజెపి కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ నెలకొంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఒక ఎమ్మెల్యే కూడా లేని సందర్భంలోనే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదిలాబాదులో బీజేపీ గెలుపు సాధించింది.
ప్రస్తుతం అదిలాబాద్ లో 4 ఎంఎల్ఏ స్థానాలు ఉండటం బీజేపీ కి కలిసొచ్చే అవకాశం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వ గురువు స్థానంలో నిలపడానికి ప్రయత్నం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ హవా ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
అదిలాబాద్ జిల్లాలోని గ్రామ గ్రామాన ప్రజలను కలిసిన సందర్భాల్లో అభ్యర్థి ఎవరు అయిన మాకు సంబంధం లేదు కేంద్రములో బీజేపీ నే ఉండాలి అని ముక్కుసూటిగా సమాధానాలు ఇస్తున్నారు.
అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ వ్యక్తిగత ఇమేజ్ కి మోది మేనియ తోడు అవడం కలిసి వస్తోంది.
బీజేపీ కి ఓటు వేయడానికి ఇతర పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా వినికిడి.
ఇక, అభ్యర్థుల పరంగా చూస్తే…
బీ ఆర్ ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు తక్కువే కనబడుతున్నాయి. జిల్లాలోని బిఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు మెల్లమెల్లగా పార్టీని వీడుతున్నారు. ఇటీవలే ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప పార్టీని వీడారు, మాజీ మంత్రి ఐకి రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళ్లడంతో భారతీయ రాష్ట్ర సమితి మరింత డీలా పడింది.
కాంగ్రెస్ లో మరో ఇబ్బంది కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ లో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాం నాయక్, జాదవ్ నరేష్ టికెట్ కోసం పోటీ పడినప్పటికీ… వీరిద్దరినీ కాదని… ఉపాధ్యాయురాలు అయిన అత్రం సుగుణకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో సహజంగానే కొంత గందరగోళం నెలకొంది. అధికార పార్టీ కాబట్టి కొంతమేర సానుకూలత ఉన్నప్పటికీ అదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీకి క్యాడర్ తక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం.
నియోజక వర్గంలో కాంగ్రెస్ కి అంత పట్టు లేదు కొంత వరకు ఓట్లు చీల్చినా ..గెలుపు దిశగా అడుగులు మాత్రం కష్టంగానే కనిపిస్తుంది.
ముగ్గురూ ఉపాధ్యాయులే పోటీలో ఉన్నారు పోటీలో నిలిచి గెలిచేది ఎవరు అనేది కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఎన్నికల తేది దగ్గర పడుతుండటంతో పార్టీ లు గడప గడపకు ప్రచారం జోరు పెంచాయి.
అదిలాబాద్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్యే పోటీ ఉన్నప్పటికీ ..బీజేపీ కే గెలిచే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా హిందుత్వ వాదుల ఏకీకరణ జరిగి భైంసా,నిర్మల్ వంటి ప్రాంతాలలో మెజారిటీ ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది.
మోది మేనియా ఉత్తర తెలంగాణ లో అదిలాబాద్ జిల్లాలో ఎక్కువ గా కనిపిస్తోంది. సంఘ్ పరివార్ సంస్థ లు, ,జాతీయవాద గ్రూప్ లు, వివిధ హిందుత్వవాద సంస్థలు బిజెపి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి.
– మునిగెల శ్రీధర్